జాతీయ రహదారి 44 రోడ్డుపై ఉదృతంగా వరద నీరు
పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పర్యవేక్షణ
కామారెడ్డి, వార్తటుడే, ఆగస్టు 28 :
కామారెడ్డి జిల్లాలో ఉదృతంగా భారీ వర్షాలు కురుస్తున్న సందర్బంగా జాతీయ రహదారి 44 జంగంపల్లి గ్రామ సమీపంలో వరద నీరు ఎక్కువ మొత్తం లో ప్రవహించడం వలన రాక పోకలు నిలిచిపోయాయి. ఈ సందర్బంగా నిజామాబాద్ నుంచి వెళ్ళే వాహనాలకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దింతో పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో పటిష్టమైన బందొబస్త్ ఏర్పాటు చేసారు. వరద నీటి వద్దకు వాహనాలు వెళ్లకుండా, ప్రజలు వెళ్ళాకుండా పటిష్టమైన జాగ్రత్త లు తీసుకున్నారు.
ప్రస్తుతం పై భాగం నుండి వరద నీరు ఎక్కువ రావడం జరుగుతుంది.ఈ సందర్బంగా అత్యవసర వున్నవారిని JCP ద్వారా ప్రజల ను అటు వైపు నుండి ఇటు వైపుకు దాటివాడం జరుగుతుంది.bవాహనాల రాక పోకల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్బంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సన్వాన్, కామారెడ్డి ఎస్ పి ఎమ్. రాజేష్ చంద్ర, మైనారిటీ ఫార్మర్ చైర్మన్ అక్రమ్ తదితరులు గలరు.